KMM: వేంసూరు మండల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం మహమ్మద్ ఫక్రుద్దీన్ అలీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామపంచాయతీలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు కంటి చుక్కలు అందజేశారు. అలాగే శాస్త్ర చికిత్స అవసరమైన రోగులను ఖమ్మంకు తరలించి, ఉచిత ఆపరేషన్లకు ఏర్పాటు చేశారు.