MDK: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.