మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ కాలనీలో కురువ శ్రీశైలం బుధవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు గంజి వెంకన్న, శివరాజ్ పాల్గొన్నారు.