JGL: బీర్పూర్ మండల రైతు వేదికలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కల్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి చెక్కులు సోమవారం పంపిణీ చేశారు. మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 30.03 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అలాగే ఐదుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసి, పథకాలు అర్హులకు చేరాయన్నారు.