NZB : ఖిల్లా రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరాముని జీవితం ధర్మం, న్యాయం, సత్య మార్గంలో ఎలా నడవాలో నేర్పుతుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడం సంతోషకరమని పేర్కొన్నారు.