NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని ఆదివారం మూసివేయనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 11:00 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి ఆలయం తెరుచుకుంటుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాగలరని ఆమె కోరారు.