RR: మొంథా తుఫాన్ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రాచకొండ పోలీసులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటి ప్రవాహంతో ఉన్న కాలువలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, చెట్ల కింద, పాత గోడలకు పక్కన ఉండకూడదన్నారు. అత్యవసర సమయాల్లో 100, 112కు డయల్ చేయాలన్నారు.