ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని, కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక ఎన్నికల గురించి చర్చించారు.