KMR: కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నేడు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, RDO ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఉన్నారు.