BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు భారీగా ఆదాయం సమాకురింది. ఆదివారం సుమారు 46వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ.50,54,516 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు యాదరుషి నిలయం, కార్ పార్కింగ్ తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.