BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, కార్ పార్కింగ్, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,49,759 ఆదాయం వచ్చిందన్నారు.