BHPL: భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో గురువారం జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. తీజ్ పండుగ లంబాడీ సంస్కృతికి ప్రతీక అని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లంబాడీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.