KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని తన నివాసానికి సమీపాన ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కొబ్బరికాయ కొట్టి తన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి పూజారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశీర్వచనాలు అందుకున్నారు.