HYD: దీపావళి పండుగ సందర్భంగా టపాసుల శబ్దాలకు భయపడిన ఓ పిల్లి సికింద్రాబాద్ పరిధిలో బావిలో పడింది. బయటకు రాలేకపోవటానికి గమనించిన స్థానికులు అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ బృందాలకు సమాచారం అందించారు. పిల్లిని రక్షించడం కోసం లోతైన బావిలోకి దిగి, పెద్ద సాహసమే చేశారు. పిల్లిని రక్షించడం పట్ల స్థానికులు హర్ష వ్యక్తం చేశారు.