SRD: నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన కర్రే లచ్చవ్వ ఇటీవల మరణించారు.. అయితే ఈమె పేరున ఉన్న రైతు బీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. అయితే భీమాకు సంబంధించిన పత్రాన్ని మృతురాలి కుమారుడు సాయిలుకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రేయారెడ్డి తదితరులు ఉన్నారు.