HNK: పట్టణ కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీలో శుక్రవారం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా WGL పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.