NLG: ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఓటు విలువ, ఎన్నికల గురించి వారు తెలియజేస్తూ గ్రామ ప్రజలు స్నేహభావంతో మెలగాలని సూచించారు.