HYD: దుర్గం చెరువులో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో.. దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్ వ్యర్థాలు చేరకుండా వాటర్ బోర్డు అధికారులు కట్టడి చేశారు. ఎస్టీపీలను నిర్మించి శుద్ధిచేసిన జలాలే చెరువులో చేరేవిధంగా చర్యలు చేపట్టారు.