JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం వచ్చిన ఆదాయం వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.79,862, ప్రసాదాల ద్వారా రూ.59,080, అన్నదానం ద్వారా రూ.14,044 ఆదాయం లభించింది. మొత్తంగా రూ.1,53,986 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.