KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం రెండో రోజు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు అద్దాలు వాడాలని సూచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్లు రవీందర్, లింబాద్రీ ఉన్నారు.