MDCL: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అనురాధ, పీ.సత్యం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వారు గుర్తుచేశారు.