మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత దోమ పరమేశ్వర్ను సేవా రత్న పురస్కారం వరించింది. సోమవారం హైదరాబాదులోని టూరిజం ప్లాజా హోటల్లో బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ.. తనకు పురస్కారం అందించిన కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.