SRD: సిర్గాపూర్లో పశువుల తొట్టెల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ నేడు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద, మరొకటి నల్లవాగు వెళ్లే రహదారిలో పశువుల తొట్టెలు జీపీ నిధులతో నిర్మిస్తున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని, పశువుల దాహార్తి కోసం వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.