KMR: రెండు నెలలుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 879 మంది రైతులకు గాను రూ.74 లక్షలు కేటాయించింది. పంట నష్టం పరిహారం నిధులు త్వరలోనే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు.