సంగారెడ్డి: నారాయణఖేడ్ RTC డిపో ఆధ్వర్యంలో రేపటి నుంచి దసరా స్పెషల్ బస్సు లు నడపనున్నట్లు DM మల్లేశం శుక్రవారం తెలిపారు. ఖేడ్ నుంచి JBS సికింద్రాబాద్కు 10 స్పెషల్ బస్సులు, అదేవిధంగా లింగంపల్లి వరకు 10 స్పెషల్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. RTC బస్సుల్లోనే సురక్షిత ప్రయాణమని పేర్కొన్నారు.