NRML: బాసర ఆర్జీయూకేటీ, మహబూబ్ నగర్ కేంద్రాలలో స్పోర్ట్స్, ఎన్సీసీ, పీహెచ్సీ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 26, 27న నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు బాసర క్యాంపస్కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్యాంపస్ను సందర్శించాలని కోరారు.