KMM: ఖమ్మం నగరం నలుమూలల నుంచి తరలివచ్చే గణనాథులకు గాంధీచౌక్ లో స్వాగతం పలికే విధంగా స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు గాంధీచౌక్ సెంటర్లో సార్వజనిక గణేష్ నిమజ్జన వీడ్కోలు బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సెంటర్లో లారీ ట్రక్కును వేదికగా మార్చి అలంకరించారు.