NRML: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెంబి ఎస్సై హనుమాన్లు సూచించారు. మందపల్లి గ్రామంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రహదారులపై పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాల పాటనే ప్రాణ భద్రతకు మార్గమని తెలిపారు.