BDK: అశ్వారావుపేట మండలం కవడిగుండ్లలో పులి సంచరిస్తుందని గ్రామస్థుల అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పాడి పంటలకు ఉపయోగపడే ఆవు అదృశ్యం అవడంతో గ్రామస్తులు వెతకగా స్థానికంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆవు కళేబరం దర్శనం ఇవ్వడంతో భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు.