KMM: ముదిగొండ మండలంలో ఆదివారం పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం ప్రజలు పలు సమస్యలపై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.