NZB: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపొందడంతో నవీపేట్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబురాలు జరిపారు. బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా నాయకులు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధ, భూషణ్, రాము, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.