NZB: విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం కోరారు. ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. ఆకాశ్, అక్షయ్, గణేశ్, ఉదయ్, కిరణ్, వికాస్, భూమేష్ పాల్గొన్నారు.