ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాంకుల్లో నగదు కొరతతో ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ నెలకు 4 లక్షల మంది ఖాతాల్లో రూ.90 కోట్లు జమ చేసినా విత్డ్రా చేయలేకపోతున్నారు. పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. RBI వద్ద నగదు కొరత, వరుస సెలవులు కారణమని తెలుస్తోంది. వెంటనే ఈ విషయంపై అధికారులు స్పందించాలని బాధితులు కోరారు.