MNCL: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యారియా కేటాయింపుల్లో పక్షపాతం చూపిస్తుందని CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి సోమవారం ప్రకటనలో తెలిపారు. రాజకీయ ఎత్తుగడలతోనే జిల్లాకు సరిపడ యూరియా సప్లై చేయడం లేదన్నారు. రైతులకు ఎంత యూరియా అవసరమో వ్యవసాయాధికారులు అంచనా వేసినా కేంద్రం యూరియా కేటాయింపుల్లో వ్యత్యాసం చూపిస్తుందన్నారు.