BDK: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు నిమగ్నమై నందున సోమవారం జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడినది. జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వినతిపత్రాలు, దరఖాస్తులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇన్ వార్డ్ విభాగంలో సమర్పించవలసిందిగా కోరారు.