VSP: గాజువాకలోని పెద గంట్యాడ శివారులో ఏర్పాటు కానున్న అదానీ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ నిర్మాణ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ యూనిట్ వల్ల కాలుష్యం భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇవాళ సాయంత్రం పెద గంట్యాడ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.