WNP: మదనాపురం మండల BRS సోషల్ మీడియా ప్రధానకార్యదర్శి, మలిదశ ఉద్యమకారుడు దుప్పల్లికి చెందిన రమేష్ బాబు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బుధవారం పార్టీకి రాజీనామాచేసి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో రమేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.