ADB: తాంసిలోని కప్పర్లలో పశు వైద్య అధికారులు పశువులకు మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. పశువులకు ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందని, రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింలు, శ్రీనివాస్, రాకేష్, తదితరులున్నారు.