HYD: సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కళా మండలి అధ్యక్షుడు అశోక్ మాదిగ రామచంద్ర మాదిగ డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర సమావేశం అల్వాల్ లోతుకుంటలో నిర్వహిస్తామని మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.