SDPT: ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో పోలీస్ కమీషనర్లో ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లోని నేర కార్యకలాపాలు, ప్రజా సమస్యలు వంటి ముఖ్యమైన అంశాల గురించి 8712667407కు చేసి కమిషనర్తో మాట్లాడవచ్చన్నారు. ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు.