GDWL: ఎస్పీ టి.శ్రీనివాస రావు గద్వాల్ టౌన్, సీసీఎస్ పోలీస్ స్టేషన్లను ఇవాళ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు పరిశీలించారు. అలాగే ప్రజల పట్ల స్నేహ పూర్వంగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలలో కలిసిపోయి పని చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.