RR: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు సోమ, మంగళవారాల్లో అంతరాయం ఉంటుందని కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గౌరిదేవి పల్లి హెడ్ వర్క్ వద్ద సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దీనిని గమనించి ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.