JN: పాలకుర్తి మండలం వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారికి గురువారం జనగామ పట్టణానికి చెందిన భక్తులు బెల్లీదే ఉపేందర్-పద్మ దంపతులు మకర తోరణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుందరాచార్యులు, ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నీరటి చంద్రయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.