SDPT: బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మెరుగు భాగ్యరెడ్డి (35) ఆదివారం సాయంత్రం తనకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాచారం గ్రామానికి చెందిన గజఈతగాళ్లతో శవాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.