NRML: లక్ష్మణ్చందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిఇఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు.