HNK: పరకాల పట్టణ కేంద్రంలో ఆదివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ సుష్మ మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాలనీల్లో తడి, పొడి చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించి అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు.