MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు కోసం మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎంపీడీవో భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.