SDPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక దూల్మిట్ట మండల అధ్యక్షుడిగా బడుగు సాయిలు నియామకమయ్యారు. ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. జాతి చైతన్యం కోసం చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.