టీమ్ ఇండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా తనకు కుమారుడు పుట్టిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, చంద్రమండలంలో తేలియాడుతున్నట్లుగా ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆదివారం ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన డురాండ్ కప్ 2023(Durand Cup final 2023) ఫైనల్ మ్యాచులో MBSG జట్టు విజయం సాధించింది. EBFCని 1-0తో ఓడించింది.
పిలు రిపోర్టర్ అంపైరింగ్ కెరీర్ 28 ఏళ్ల పాటు కొనసాగింది. 14 టెస్టులు, 22 ODIలతో సహా 34 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆయన అంపైరింగ్ చేశాడు. అంతర్జాతీయ అంపైరింగ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు పిలు రిపోర్టర్ విద్యుత్ శాఖలో పనిచేశారు.
కొన్ని రోజుల క్రితం హీత్ స్ట్రీక్ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. ఈ వార్తను జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్రీ ఒలాంగా అందించాడు. అయితే తరువాత ఒలంగా ఈ వార్తలను తప్పు అని.. హీత్ స్ట్రీక్ జీవించి ఉన్నాడని చెప్పాడు. అయితే ఈసారి జింబాబ్వే మాజీ కెప్టెన్ కన్నుమూసినట్లు అతని భార్య సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది.
మ్యాచ్ ప్రారంభం కాకముందే వర్షం కురిసి పాక్ ఇన్నింగ్స్ ఆడకముందే మ్యాచ్ ముగిసింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే మళ్లీ వర్షం కురిసి చాలా సేపు నిలిచి మ్యాచ్ ఆడేందుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో మ్యాచ్ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు.
ఆసియా కప్కు ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించారు. ఆసియా కప్కు ఎంపికైన 18 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ, ప్రముఖ ఫాస్ట్ బౌలర్ కృష్ణ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్లు ప్రపంచకప్కు ఎంపిక కాలేదు.
వన్డే ఫార్మాట్లో 2019 ప్రపంచకప్ తర్వాత అంటే దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దాయాది జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అందరి చూపు ఇరు జట్లలోని కొందరు ఆటగాళ్లపైనే ఉంటుంది.
మ్యాచ్ కోసం భారత జట్టు హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంది. కానీ తాజా నివేదికల ప్రకారం, వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. పిచ్, దాని పరిసరాలు చాలా వరకు కప్పబడి ఉన్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
2023 ఆసియా కప్ మొదలైన తరువాత మొదటి సారి ఇండియా పాకిస్థాన్ రెండు పెద్ద జట్లు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే క్యాండీ జిల్లాలో ఈ రోజు వర్ష సూచన ఉండడంతో అభిమానలు ఆందోళన చెందుతున్నారు.
జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023 పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాస్తా తడబడినట్లు అనిపిస్తుంది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన ఈ భారత అథ్లెట్..ఈసారి 85.71 మీటర్లతో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్రేక్ చేశాడు. ఆసియా కప్ టోర్నీలోని మొదటి మ్యాచ్లో పాక్ జట్టు విజయం సాధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 151 పరుగులు చేసి పలు రికార్డులను తిరగరాశాడు.