చాలామంది జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు ఉన్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్లు వరుస పెడుతున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్లు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్లో రెండవ మ్యాచ్లో భారతదేశం - పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10న కొలంబోలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది.
మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించేందుకు టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచకప్ జట్టును ప్రకటించారు.
ట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఏ జట్టు పైన అయినా, ఎలాంటి బౌలర్ బౌలింగ్లోనైనా ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఉన్నటువంటి చాలా మంది ఆటగాళ్లను జట్టులో చేర్చారు. అలాంటి నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..
ఇషాన్ కిషన్ ప్రపంచకప్లో భారత జట్టుకు గేమ్ ఛేంజర్గా నిరూపించుకోగలడు. తన ఫాస్ట్ బ్యాటింగ్తో పాటు, ఇషాన్ కిషన్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ తన సత్తా చాటాడు.
ఇండియా పేరును కేంద్రం మారుస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రముఖుల ట్వీట్లు వైరల్గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి ఒక ట్వీట్ చేశారు. అది నెట్టింట్లో తెగ వైరల్గా మారింది.
మాములుగా ఇండియన్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అందరిలో ఉత్సాహాం ఉంటుంది. చాలా మంది ఈ ఆటను మైదానంలోనే చూడాలనుకుంటారు. అందుకు వేల రూపాయలను లెక్కచేయక టికెట్లు కొంటుంటారు. అయితే ఆసియా కప్లో భాగంగా జరగనున్న మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో? ఎందుకంటే టికెట్ల ధరలు చూస్తే అలా ఉన్నాయి మరి.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య సాగుతున్న గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా గంభీర్ గ్రౌండ్ నుంచి వస్తుండగా అక్కడున్న ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో గంభీర్ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
విరాట్ కోహ్లీ ఆ రోజు మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ వద్దకు వెళ్లి అతనిని కౌగిలించుకుని కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ను కూడా కలుసుకున్న కోహ్లి అతనితో కొద్ది క్షణాలు గడిపాడు
బోపన్న ద్వయం ఈరోజు పురుషుల డబుల్స్ 16వ రౌండ్లో బ్రిటన్ జోడీ జూలియన్ క్యాష్, హెన్రీ పాటన్లను ఓడించారు. తద్వారా పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డన్ జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డన్ జోడీ 6-4, 6-7, 7-6తో జూలియన్ క్యాష్, హెన్రీ పాటన్పై విజయం సాధించింది.